పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర

చిత్రం
ఉ మ్మడి నెల్లూరు జిల్లా... నేటి తిరుపతి జిల్లాలో జరిగే విశిష్టమైన ఉత్సవాల్లో  పోలేరమ్మ జాతర కూడా ఒకటి.... అమ్మా అని పిలిచినంతనే.... పలికే దేవతగా పోలేరమ్మ ప్రసిద్ధం.... పిలిచిన ప‌లికే దేవ‌త‌గా పూజ‌లందుకుంటున్న అమ్మ‌ వారికి సాంప్ర‌దాయంగా ఏటా జరుపుకొనే జాతరే....  పోలేరమ్మ జాతర.... వెంక‌ట‌గిరి గ్రామ శ‌క్తి పోలేర‌మ్మ జాత‌ర 17వ శ‌తాబ్ధం నుంచి జ‌రుగుతున్న ఇప్ప‌టికీ  త‌న ప్రాశ‌స్త్యాన్ని అలానే కొన‌సాగిస్తోంది.. 1717  వెంకటగిరి పట్టణంలో కలరా వ్యాప్తి చెందింది..  అప్పటి నుంచి రాజాలు శీతల యాగాన్ని జరిపించారు... అనంతరం అష్టదిగ్బంధనం చేసి  యంత్రాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి పోలేరమ్మ జాతరను నిర్వహించారు..నాటి నుంచి  జాతర నిర్విరామంగా ప్రతి యేడాది సాగుతోంది.   వినాయక చవితి వెళ్లిన మూడవ బుధ , గురువారాల్లో అమ్మవారి జాతర జరుగుతోంది.  వినాయక చవితి ముగిసిన తొలి బుధ వారం రాత్రి తొలి చాటింపు వేస్తారు.  రెండు బుధవారం  మలి చాటింపు వేస్తారు. ఈ చాటింపు బయటివారు విన్నా... చాటింపు తర్వాత గ్రామంలో నిదుర  చేసినా వారు తప్పక జాతరలో పాల్గొనాల...

రామ మార్గమే .. రామాయణం

చిత్రం
శ్రీరామ రామ రామేతి  రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం  రామనామ వరాననే..    ఈ శ్లోకాన్ని మూడు సార్లు  పఠించినంతనే... విష్ణు సహస్రనామ ఫలితం లభిస్తుందని  పెద్దలు సూచిస్తారు. వాల్మికి 'మరా'.. శబ్దాన్ని మననం చేస్తుండగా.. రామశబ్ధం ఉద్భవించిందని  నమ్మకం.. శ్రీరామ అని పలికినంతనే.. సర్వపాపాలు తొలగుతాయని..  విశ్వాసం.. మానవుడిగా    జన్మించిన రాముడు.. వ్యక్తి ఎలా జీవించాలో.. రాజు ఎలా ఉండాలో.. సూచించిన  మార్గమే...  రామాయణం...  ఈ పదాన్ని పూర్తిగా ఇలా రాయాలి... రామ ఆయనం... అంటే రాముని   ప్రయాణం అని..        అయోధ్య రాజైన దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకయి అను ముగ్గురు భార్యలు .. వారి వల్ల కౌసల్యకు రాముడు,  సుమిత్రకు లక్ష్మణుడు, శతృఘ్నడు, కైకేయికి భరతుడు జన్మించారు.  సకల విద్యలో వారు ఆరితేరారు...        విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం..ఆయన  వెంట రామలక్ష్మణులు వెళ్లి  తాటక సంహారం, సుబాహు వధ.. చేశారు.. మిథిలానగరంలో ఎందరో యోధల గర్వం సర్వాన్ని హరించిన..  శ...

మార్పు .....

చిత్రం
   మార్పు సహజం ...... అవసరం....... అంతెందుకు ఈ సృష్టిలోని ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది... మార్పు లేకుంటే ఈనాడు మనం మనుషులుగా పరిణామం చెందుండే వాళ్ళమే కాదు....    బిగ్ బ్యాంగ్ థియరీ ... గొప్ప అణు విస్పోటనం తో లక్షల ఏళ్ల తరబడి మండుతున్న భూమి చల్లబడి జీవానికి మార్గం చూపింది..ఏక కణ జీవి నుంచి డైనోసోర్‌ వరకు ఎన్నింటికో ఆటపట్టైంది..మానవ పరిణామ క్రమం కూడా మార్పు చెందింది.ఆదిమానవుడు, నుండి ఆధునిక మానవుడిగా పరిణామం చెందటంలో ఎంత గొప్ప మార్పు ఉందో చూడొచ్చు.  ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా అభివృద్ధి చెందడానికి మొదట గుడ్డుగా జన్మించి లార్వ, ప్యూపా దశలను దాటి  సీతాకోకచిలుకగా  పరిణతి చెందుతుంది. మనిషిలోను అంతే..... ఒక మనిషి సాధారణ మానవుడి నుండి అభివృద్ధి చెందిన ఉన్నతమైన మానవుడిగా ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులను  ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో ఒక్కొక్క  స్టేజీను దాటుకుంటూ జయాపజయాలను అధిగమిస్తూ వాటిలోని సారాంశాన్ని తీసుకుని ముందుకు సాగిన నాడే పరిపూర్ణ మానవుడిగా కీర్తి గడిస్తాడు ...     మనిషిలో మార్పు లేకుంటే అమ్మ కడుపులో అండంలాగే ఉండి పోయే ...

నేటి విద్యార్థి...

చిత్రం
అక్షరం కంప్యూటర్ కి ఎక్కింది ..... భావం అడుగుకి చేరింది ...... అక్షరాల వ్యవసాయంలో   సారం తగ్గి అర్ధాలు మారాయి...  యూట్యూబ్ వీడియోలతో  అక్షరాల నడకల్లో తేడాలొచ్చాయి...... చిన్న వీడియోల మోజులో  అక్షరం పై ప్రేమ తగ్గింది......  ఇన్స్టా నవ్వులు, ట్విట్టర్ కూతలు, రీల్స్ నడకలతో చదువు పెట్టెలో చేరింది......  కే డ్రామాల సాగతీతలతో  మానవ సంబంధాలు అటకెక్కుతున్నాయి...... - విరించిక

'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!

చిత్రం
                 "Mind.... the world's greatest weapon" జ లాన్ని మేఘాలు ఆకర్షిస్తాయి. కొండలు వృక్షాలు మేఘాలను ఆకర్షిస్తాయి. మేఘాలు వర్షిస్తే ప్రతి చిరుకును భూమి ఆకర్షిస్తుంది. పుడమి చేరిన నీటి చుక్క మట్టికి పదును పెంచి మొక్కలు వృక్షాలు పెరిగేలా చేస్తుంది. ఇది ఒక ప్రాకృతిక ధర్మం.... వీటి ధర్మాలు వేరుగా ఉన్నా అన్నింటిలో సాధారణంగా కనిపించేది ఆకర్షణ.. ఆ ఆకర్షణకు విశ్వాన్ని నడిపించే శక్తి ఉంది. అందుకే ఏ ఆధారం లేకుండా విశ్వం శూన్యంలో స్థిరంగా ఉంది. ఈ భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆకర్షణ ప్రతి దగ్గర తన శక్తిని చూపుతూనే ఉంటుంది.   ప్రకృతైన.. జీవజాలమైన.. ఈ ఆకర్షణకు లోబడే జీవనయానాన్ని సాగిస్తూ ఉంటాయి.      సమాజంలో ఉండే జీవరాశులన్నింటిలోనూ బ్రతికేందుకు అవసరమైన తెలివితేటలు ఉన్నాయి.  తన ఆహారం కోసం జింక కన్నా వేగంగా చిరుత పరిగెత్తితే.... తన ప్రాణం కోసం జింక మెరుపు వేగాన్ని చూపుతుంది. చిరుత , జింకల్లోని ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచిస్తే ఓ విషయంపై స్పష్టత వస్తుంది. అదే మేధస్సు.....     మనిషి సహజంగ...

నారీ శక్తికి రిజర్వేషనా..?

చిత్రం
  స్త్రీ... ఈ అక్షరంలో విశ్వం... దాగుంది... త్రిగుణాత్మకమైన... ఈ రూపం... సాక్ష్యాత్తు అమ్మవారి స్వరూపమే...  కానీ మహిళను కేవలంగా చూసే... కొందరికి...  నారీశక్తి    గురించి  తెలియకపోవ డం..సహజం.. .    ఎక్కడైనా ఒకటి కన్నా ఎక్కువ పనులను చేసేవారిని బహుముఖ ప్రజ్ఞాశాలి.. అంటాం..  అలా చూస్తే ప్రతి మహిళా బహుముఖ ప్రజ్ఞాశాలే... ఉదయం లేచినప్పటి నుంచి కుటుంబాన్ని.. సమాజాన్ని సమైక్యంగా ... సమర్ధంగా నడిపిస్తూ ఉంటుంది.. పురుషుడు చేయలేని పనులను సైతం అవలీలగా చేసి.. శక్తికి మరో రూపంగా  నిలుస్తుంది..      అందుకే పురాణాల్లో అమ్మవారిని సర్వశక్తి స్వరూపంగా పూజిస్తారు.. సాక్ష్యాత్తు లోకపాలకులైన  త్రిమూర్తులకు జన్మని.. శక్తిని ఇచ్చిన అమ్మవారు జగజ్జనని అంటే ఆశ్చర్యం కాదు.... సాధారణ కుటుంబం నుంచి .. అసాధారణ కార్పొరేట్ కంపెనీల వరకు మహిళలు  సునాయాసంగా  నడపగలరు....    ఆకాశంలో సగమని అంటూనే.. మహిళలను అధః పాతాళానికి అణిచివేసేది పురుషజాతి..  తల్లిగా... చెల్లిగా... ప్రియురాలిగా... బిడ్డగా... స్నేహితురాలిగా.. ఎన్నో...

కర్తవ్యపథ్.......

చిత్రం
 140 కోట్ల భారతీయుల భవిష్యత్తు నిర్దేశమయ్యే నూతన ప్రాంగణం ప్రారంభమైంది..... కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధుల స్వరం ఈ భవనంలో ప్రతిధ్వనిస్తుంది ఇక్కడ చేసే వాద ..ప్రతివాదాలు.. నిర్ణయాలు.. సలహాలు.. సూచనలు.. శాసనాలు భారత భవిష్యత్తును నిర్ణయిస్తాయి..... ప్రతిక్షణం ప్రజాదనంతో ఇక్కడ సమావేశాలు సాగుతాయి. .....ప్రజల ఆశలకు.. ఆనందాలకు... భవిష్యత్తు భరోసా కు ఈ భవనమే వేదిక... ప్రధానమంత్రి మోడీ దార్శనికతకు  ఢిల్లీలోని సన్సాద్ మార్గ్ లోనిర్మితమైన   నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం.....       భారతీయ చారిత్రక వైభవానికి ప్రతీకైనా సెంగోల్ చేత ధరించి మోడీ తొలి అడుగులు వేయగా యావత్ పార్లమెంటు సభా సదులంతా నూతన భవన ప్రాంగణంలోనికి ప్రవేశించారు. మోడీ తొలి పలుకులతో సభా ప్రాంగణం  మారు మ్రోగింది. భారతీయుల తలరాతను మార్చే నవశకానికి నూతన పార్లమెంట్ భవనంలో నాంది ప్రస్తావన జరిగింది. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోద ప్రస్తావనతో సభ ముందుకు సాగి భారతీయ సంప్రదాయాల్లో మహిళా ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది.       షట్ద్వారాలతో నూతన పార్లమెంటు భవనం రూపుదిద్దుకుంది. హైం...

విశ్వ కేతనం.. శాంతినికేతనం.....

చిత్రం
  ప చ్చదనం పరిఢవిల్లే ప్రదేశం... పెద్ద పెద్ద వృక్షాల నీడన విద్యాభ్యాసం.. అడుగడునా.. జ్ఞాన లహరి.. ఆధ్యాత్మిక దొంతరలు... ఇవన్నీ నేటి సమాజంలో చూస్తే.. కాస్తంత విడ్డూరంగానే ఉంటుంది.. కానీ ఈ విహారం... ఆధ్మాత్మిక ప్రయాణం.. శాంతినికేతనంలో సర్వసాధారణం... ప్రతి అడుగు.. ప్రగతి మార్గాన్ని చూపుతుంది.. నేల మీద కనిపించే ప్రతి ఆకు నిన్నటి చరిత్ర స్పృశిస్తుంది.. అక్కడా గుంభనంగా సాగే..  పిల్ల తెమ్మెరలు కూడా... ఎన్నో కథలను.. వాటి సువాసనలను మోసుకుంటూ వెళుతూనే ఉంటాయి.... విజ్ఞానానికి ప్రతీకగా... విశ్వకవి రవీంద్రుని కలల జ్ఞాన పీఠంగా శాంతినికేతన్ నిలిచింది.. బెంగాల్ మణిమకుటంలో శాంతినికేతన్ ఓ కలికితురాయిగా మెరుస్తోందని మేధావులు భావిస్తారు.. భావిస్తూనే ఉన్నారు..  అంతటి గొప్ప శాంతినికేతన్ కు యునెస్కో గుర్తింపు లభించడం బంగారానికి తావి అబ్బడం లాంటిదే..          అసలు ఏంటీ శాంతి నికేతన్..?  ఎంతో మంది పెద్దలు చెబుతుంటారు.. ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలని విశ్వకవి రవీంద్రుని కవితలు చదివిన వారి భావన.. ఎంతో మందికి అందని కలలా నిలిచే ఈ అపురూప ప్రదేశం... నేడు ప్రపంచ వారసత...